Vizag: విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుంది: మంత్రి బొత్స

ap minister botsa satyanarayana says ap administrative capital will established in vizag

  • విశాఖకు రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల్లో బలమైన కాంక్ష ఉందన్న బొత్స
  • విశాఖ గర్జనలో ఆ విషయం తేటతెల్లమైందని వెల్లడి
  • జనసేనను ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థగా అభివర్ణన
  • టీడీపీ, జనసేనలకు విశాఖపై అంత కక్ష ఎందుకని నిలదీత

విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయంపై విస్పష్ట ప్రకటన చేశారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని కూడా ఆయన పేర్కొన్నారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావాలన్న కాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందని కూడా ఆయన చెప్పారు. ఈ విషయం శనివారం నాటి విశాఖ గర్జనలో స్పష్టమైందని బొత్స తెలిపారు. 

ఈ సందర్భంగా జనసేన, టీడీపీలపై బొత్స విమర్శలు గుప్పించారు. విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుంటే... టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయని బొత్స ఆరోపించారు. 3 రాజధానుల అంశంపై ఆ రెండు పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏమిటని బొత్స ప్రశ్నించారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. విశాఖకు వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలు ఆడే ఆటలు ఇకపై చెల్లబోవని కూడా బొత్స అన్నారు. జనసేన అసలు ఓ రాజకీయ పార్టీనే కాదన్న బొత్స... ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థగా అభివర్ణించారు. జనసేనతో పాటు టీడీపీకి విశాఖపై అంత కక్ష ఎందుకని బొత్స ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News