TDP: కర్నూలు జిల్లా పర్యటనకు చంద్రబాబు... రేపటి నుంచి 3 రోజులు అక్కడే బస

tdp chief chandrababu tour in kurnool district starts from tomorrow

  • పత్తికొండలో బహిరంగ సభతో ప్రారంభం కానున్న చంద్రబాబు పర్యటన
  • బుధవారం రాత్రి ఆదోనిలో బస చేయనున్న టీడీపీ అధినేత
  • గురువారం ఆదోని, ఎమ్మిగనూరుల్లో రోడ్ షో నిర్వహించనున్న వైనం
  • గురువారం రాత్రి కర్నూలులో బస... శుక్రవారం ఉదయం జిల్లా నేతలతో సమీక్ష

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రేపు (బుధవారం) కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఆయన జిల్లాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 2 రాత్రులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బస చేయనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటనకు సంబంధించి టీడీపీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

రేపు మధ్యాహ్నానికి జిల్లాలోని పత్తికొండ చేరనున్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం రాత్రికి ఆదోనికి చేరుకునే ఆయన పట్టణంలోనే బస చేస్తారు. గురువారం ఉదయం ఆదోనిలో రోడ్ షో నిర్వహించనున్న చంద్రబాబు... ఆ తర్వాత జిల్లాలోని ఎమ్మిగనూరులో రోడ్డు షో నిర్వహిస్తారు. సాయంత్రం పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడతారు. గురువారం రాత్రికి కర్నూలులో బస చేయనున్న చంద్రబాబు... శుక్రవారం నగరంలో పార్టీకి చెందిన జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News