Vande Bharat Express Rail: ‘వందేభారత్’పై మళ్లీ దాడి.. ఈసారి బీహార్‌లో

Stones pelted at Vande Bharat Express in Bihar

  • ‘వందేభారత్’ రైళ్లపై కొనసాగుతున్న రాళ్ల దాడులు
  • పశ్చిమ బెంగాల్, విశాఖలోనూ దాడులు
  • బీహార్‌లోని కతిహార్ జిల్లాలో తాజా ఘటన
  • పగిలిన సి6 బోగీ అద్దాలు

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, బీహార్‌లోని కతిహార్‌ జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. రైలు నంబరు 22302పై కొందరు దుండగులు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతేడాది డిసెంబరు 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే రైలుపై రాళ్ల దాడి జరిగింది.

అలాగే, సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి ముందే విశాఖలో దాడి జరిగింది. ట్రయల్ రన్ ముగించుకుని మర్రిపాలెంలోని కోచ్ మెయింటెనెన్స్ సెంటర్‌కు వెళ్తున్న రైలుపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలోనూ కిటీకి అద్దాలు దెబ్బతిన్నాయి. వందేభారత్ రైళ్లపై జరుగుతున్న వరుస రాళ్ల దాడులు అధికారులను కలవరపెడుతున్నాయి.

  • Loading...

More Telugu News