Nara Lokesh: తిరుమలలో కాలవ శ్రీనివాసులు కుమారుడి పెళ్లికి హాజరైన నారా లోకేశ్

Nara Lokesh attends Kalava Srinivasulu son marriage in Tirumala

  • తిరుమల నుంచి కుప్పం పయనమైన లోకేశ్ 
  • రేపు యువగళం పాదయాత్ర ప్రారంభం
  • కుప్పంలో ముమ్మరంగా ఏర్పాట్లు
  • కుప్పంలో భారీ బహిరంగ సభ
  • హాజరవుతున్న అచ్చెన్నాయుడు, బాలకృష్ణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కుమారుడి పెళ్లికి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు కుమారుడు భరత్ వివాహం నేడు తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగింది. ఈ వివాహానికి హాజరైన లోకేశ్ వధూరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన తిరుమల నుంచి కుప్పం బయల్దేరారు. 

కాగా, లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగే ఈ సుదీర్ఘ పాదయాత్రకు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నారు. జనవరి 27న ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. 

పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లను టీడీపీ అగ్రనేతలు కళా వెంకట్రావు, నిమ్మల రామానాయుడు తదితరులు పర్యవేక్షిస్తున్నారు. 

ఈ బహిరంగ సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. యువగళం యాత్రకు సంఘీభావంగా కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News