Team India: న్యూజిలాండ్ తో తొలి టీ20... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss and elected bowling

  • భారత్, కివీస్ మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్
  • నేడు రాంచీలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

ఇటీవల న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్ గెలిచి మాంచి ఊపుమీదున్న టీమిండియా, తాజాగా టీ20 సిరీస్ కు సిద్ధమైంది. నేడు రాంచీలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 18, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 5 పరుగులతో ఉన్నారు. టీ20 సిరీస్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ కు మిచెల్ శాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News