Bopparaju: మూడున్నరేళ్లుగా ఉద్యోగులు ఓపిక పట్టారు: బొప్పరాజు

Bopparaju says employees will take further steps if govt not respond

  • ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26 డెడ్ లైన్
  • ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్న బొప్పరాజు
  • డీఏలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని ఆరోపణ

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26వ తేదీ డెడ్ లైన్ అని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 

మూడున్నరేళ్లుగా ఉద్యోగులు ఓపిక పట్టారని, ఇక ఉపేక్షించేది లేదని బొప్పరాజు స్పష్టం చేశారు. డీఏలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ నెల 26న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని, ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తామని వెల్లడించారు. 

కాగా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలో భాగస్వామ్య సంఘాల సంఖ్య ఇప్పుడు 100కి పెరిగిందని చెప్పారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ బొప్పరాజు ఈ మేరకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News