Secunderabad: తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. టైమింగ్స్, ప్రయాణ సమయం ఇలా..

Vande Bharat Express Between Secunderabad and Tirupati

  • ఏప్రిల్ 9న తిరుపతి నుంచి పరుగులు పెట్టనున్న రైలు
  • అంతకుముందు రోజు సికింద్రాబాద్‌లో ప్రారంభం
  • 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి
  • మంగళవారం మినహా మిగతా రోజుల్లో అందుబాటులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మరీ ముఖ్యంగా తిరుపతి వెంకన్న భక్తులకు ఇది శుభవార్తే. వందేభారత్ మరో రైలు అందుబాటులోకి వచ్చేస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య పరుగులు పెట్టనున్న ఈ రైలు 662 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.30 గంటల్లోనే చేరుకుంటుంది. ఏప్రిల్ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరనుంది. నిజానికీ రైలును ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ప్రారంభిస్తున్నారు. అయితే, ఆ రోజున ప్రయాణికులను అనుమతించరు. ఉదయం 11.30 గంటలకు రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 9 గంటలకు తిరుపతి చేరుకుటుంది. ఒక్క మంగళవారం మాత్రం ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు. టికెట్ చార్జీలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మధ్యలో నల్గొండ (7.19), గుంటూరు జంక్షన్ (9.45), ఒంగోలు (11.09), నెల్లూరు (12.29) స్టేషన్లలో ఆగుతుంది.
 తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నెల్లూరు (5.20), ఒంగోలు (6.30), గుంటూరు జంక్షన్ (7.45), నల్గొండ (8.10) స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
 

  • Loading...

More Telugu News