Ateeq Ahmed: పేరు తెచ్చుకోవాలనే ఆ ఇద్దరినీ చంపేశాం: అతీక్, అష్రఫ్ హంతకులు

Ateeq and Ashraf killers told they murdered them for fame

  • దుండగుల కాల్పుల్లో మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, సోదరుడు అష్రఫ్ హతం
  • జర్నలిస్టు వేషాల్లో వచ్చి కాల్పులు జరిపిన యువకులు
  • ముగ్గురు హంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రాష్ట్రవ్యాప్తంగా తమకు గుర్తింపు వస్తుందన్న నిందితులు

ఉత్తరప్రదేశ్ లో పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఓ కేసులో అతీక్, అష్రఫ్ లను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకురాగా, పాత్రికేయుల్లా వచ్చిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. 

ఈ ఘటనలో అతీక్, అష్రఫ్ రక్తపుమడుగులో కూలిపోయి అక్కడిక్కడే మరణించారు. ఈ కాల్పులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని లావ్లేష్ తివారీ, మోహిత్ (సన్నీ), అరుణ్ మౌర్య అని గుర్తించారు. తాము ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే అతీక్, అష్రఫ్ లను చంపేశామని ఆ ముగ్గురు వెల్లడించారు. 

రాష్ట్రవ్యాప్తంగా తమకు పేరొస్తుందని, భవిష్యత్తులో అది తమకు ఎంతో ఉపయోగపడుతుందని భావించామని తెలిపారు. అతీక్, అష్రఫ్ లను పోలీసు కస్టడీకి అప్పగించినట్టు తెలిసిందని, దాంతో వారిద్దరి హత్యకు ప్రణాళిక రచించామని వివరించారు. 

జర్నలిస్టుల్లా వచ్చి కాల్పులు జరిపామని, ఈ ఘటన తర్వాత పారిపోవాలని తాము భావించలేదని వెల్లడించారు. ఈ మేరకు నిందితులు చెప్పిన వివరాలను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు.

  • Loading...

More Telugu News