Nara Lokesh: ఈ గడ్డపై 1000 కిమీ చేరుకోవడం నా అదృష్టం: నారా లోకేశ్

Nara Lokesh reacts to his Yuvagalam padayatra completes 1000 kms

  • కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • 1000 కిమీ పూర్తి చేసుకున్న పాదయాత్ర
  • యావత్ రాయలసీమ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడి
  • యువత తమ మనోభావాలను తనతో పంచుకోవచ్చన్న టీడీపీ యువనేత

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఆయన పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ ఘనత పట్ల లోకేశ్ స్పందించారు. 

యువగళం పాదయాత్ర రాయలసీమ గడ్డపై 1000 కిమీ పూర్తి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అరాచకాలను ఎండగట్టేందుకు యువగళం ఒక ఆయుధం వంటిదని పేర్కొన్నారు. ఈ పాదయాత్రపై యువత తమ మనోభావాలను తనతో పంచుకోవచ్చని లోకేశ్ సూచించారు. 

"యువగళం పాదయాత్ర రాయలసీమ గడ్డపై 1000 కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడానికి సహాయ, సహకారాలు అందించిన యావత్ రాయలసీమ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నేలపై 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేయడం నా అదృష్టంగా భావిస్తూ, నా యాత్రను సఫలీకృతం చేసిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. 

రాయలసీమ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు ఈ యాత్ర ఒక ఆయుధంలా ఉపయోగపడింది. రాయలసీమలోని ప్రతి కుటుంబాన్ని సుభిక్షంగా మార్చాలన్నది నా ఆకాంక్ష. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించేందుకు నేను యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం యువత ఆలోచనలు, అభిప్రాయాలను ఈ దిగువ వాట్సాప్ నెంబర్ లో నేరుగా నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. 

వాట్సాప్ నెం. 96862 – 96862, Registration form: https://yuvagalam.com//register,  Email Id: suggestionsyuvagalam@gmail.com ద్వారా మీ మనోభావాలను నేరుగా నాతో పంచుకోవచ్చు" అని లోకేశ్ వివరించారు.

  • Loading...

More Telugu News