Lingu Swamy: దర్శకుడు లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే విధించిన కోర్టు

Director Lingu Swamy gets relief in Madras High Court

  • చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న లింగుస్వామి
  • 6 నెలల జైలు శిక్ష విధించిన సైదాపేట కోర్టు
  • కింది కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన లింగుస్వామి

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు లింగుస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెక్ బౌన్స్ కేసులో ఊరటను కల్పించింది. ఆయనకు కింది కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై స్టే విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే... లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి ఒక సినిమాను నిర్మించడం కోసం పీవీపీ కేపిటల్స్ అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి 2014లో రూ. 1.3 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే క్రమంలో రూ. 1.35 కోట్లకు చెక్ ఇవ్వగా... సదరు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీంతో పీవీపీ కేపిటల్స్ చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో వీరికి హైకోర్టు ఊరటను కలిగించింది.

  • Loading...

More Telugu News