Rahul Gandhi: ప్రధాని పట్టాభిషేకంలా ఫీల్ అవుతున్నారు: రాహుల్ గాంధీ విమర్శలు!

parliament is the voice of the people rahul taunts pm modi as new parliament is inaugurated

  • అంగరంగ వైభవంగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం
  • ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు దూరం
  • పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక అని రాహుల్ ట్వీట్

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సహా 20 దాకా ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఓపెనింగ్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. 

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. పార్లమెంటును ప్రధాని ప్రారంభించడానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ‘‘పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక. కానీ ప్రధాని మాత్రం ఈ ప్రారంభోత్సవ వేడుకను పట్టాభిషేకంలా భావిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News