Electricity: ఏపీలో ఈ నెల 10 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

AP Electricity employees set to go for indefinite strike

  • ఏపీ విద్యుత్ రంగంలో సమ్మె సైరన్
  • విద్యుత్ సంస్థల యాజమాన్యంతో జేఏసీ చర్చలు విఫలం
  • ఈ నెల 8న విజయవాడలో మహాధర్నా
  • జేఏసీ ప్రకటన

ఏపీలో విద్యుత్ రంగ ఉద్యోగుల్లో అసంతృప్తి రాజుకుంది. తమ సమస్యలపై విద్యుత్ సంస్థల యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో, జేఏసీ నిరవధిక సమ్మెకు నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది. ఈ నెల 8న విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలి రావాలని జేఏసీ పేర్కొంది.

  • Loading...

More Telugu News