Sharad Pawar: గౌతమ్ అదానీతో కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన శరద్ పవార్

Sharad Pawar visits Adani office residence in Ahmedabad

  • శనివారం అదానీ గ్రూప్ అధినేతను కలిసిన శరద్ పవార్
  • అహ్మదాబాద్ లోని ఓ గ్రామంలో ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా కలయిక
  • ఫోటోలు షేర్ చేసిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ శనివారం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని కలిశారు. అహ్మదాబాద్‌లోని సనంద్ జిల్లాలోని ఓ గ్రామంలో వీరిద్దరు కలిసి ఓ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం అహ్మదాబాద్‌లోని అదానీ నివాసానికి, ఆ తర్వాత అదానీ కార్యాలయానికి శరద్ పవార్ వెళ్లారు. 

తాను అదానీని కలిసినట్లు శరద్ పవార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీరిద్దరు కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఫోటోను కూడా పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ఏం అంశాలు చర్చకు వచ్చాయో వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News