world cup 2023: మ్యాక్స్ వెల్ నిజంగానే సచిన్ కు పాదాభివందనం చేశాడా.. వైరల్ ఫొటో వెనక అసలు నిజం ఇదిగో!

Australian cricketer Maxwell touching Sachin Tendulkars feet Photo Fake
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ఫేక్
  • ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న క్రికెటర్లు
  • సచిన్ పాదాలకు మ్యాక్స్ వెల్ మొక్కుతున్నట్లు మార్పింగ్
అనారోగ్యంతో బాధపడుతున్నా లెక్క చేయకుండా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్ ఆటను క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు. అయితే, ఈ మ్యాచ్ తర్వాత సచిన్ టెండూల్కర్ కు మ్యాక్స్ వెల్ పాదాలకు నమస్కరించాడని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటో నిజం కాదని, మార్పింగ్ చేశారని తాజాగా బయటపడింది.

ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ సాధించిన తీరు ప్రతీ క్రికెట్ అభిమానినీ ఆకట్టుకుంది. అయితే ఆఫ్ఘన్ ప్లేయర్ల పోరాటాన్నీ తక్కువ చేయడానికి లేదు. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిశాక సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వెళ్లారు. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లను అభినందిస్తూ పలు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే మ్యాక్స్ వెల్ కూడా మైదానంలోకి వచ్చి సచిన్ తో కరచాలనం చేశాడు. ఈ ఫొటోను గుర్తుతెలియని వ్యక్తులు మార్పింగ్ చేశారు.

సచిన్ పాదాలకు మ్యాక్స్ వెల్ నమస్కరిస్తున్నట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇదే భారతీయ సంప్రదాయమంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే, ఈ ఫొటోను కాస్త పరిశీలించి చూస్తే.. సచిన్ టెండూల్కర్, మ్యాక్స్ వెల్ కరచాలనం చేసిన ఫొటో అని తేలిగ్గా తెలిసిపోతోంది.

world cup 2023
Australia
Maxwell
Afghanistan
Sachin Tendulkar
Viral Pics
Fact check
Fake Photo

More Telugu News