Narendra Modi: వరల్డ్ కప్‌ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

Narendra modi to attend world cup as chief guest

  • ఆదివారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్
  • ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న టీమిండియా
  • ఫైనల్‌ను వీక్షించేందుకు వెళ్లనున్న ప్రధాని మోదీ, ధోనీ

ఆహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చారిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారట. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెబుతున్నారు. మోదీతో పాటూ క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News