Prashant Kishor: చంద్రబాబును కలిసిన అనంతరం ప్రశాంత్ కిశోర్ స్పందన

Prashant Kishor responds on meeting with Chandrababu
  • నేడు చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ
  • దాదాపు 3 గంటల పాటు సమావేశం
  • చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానన్న ప్రశాంత్ కిశోర్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడం ఇవాళ మీడియాలో ప్రముఖంగా దర్శనమిచ్చింది. ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు సమర్పించారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఇవాళ తాను చంద్రబాబునాయుడిని కలవడం వెనుక ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీనియర్ రాజకీయనాయకుడు అని, ఆయన కలవాలని కోరడంతో వచ్చానని వెల్లడించారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని వివరించారు.
Prashant Kishor
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News