Bengaluru Metro: మెట్రోట్రాక్‌పై పడిపోయిన సెల్‌ఫోన్.. తీసుకునేందుకు ట్రాక్ మధ్యలోకి దూకిన మహిళ.. సెక్యూరిటీ సిబ్బంది స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం

Woman jumps on Bengaluru Metro track to retrieve dropped phone

  • బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రో స్టేషన్‌లో ఘటన
  • క్షణాల్లో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది
  • విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సెక్యూరిటీ సిబ్బంది
  • 15 నిమిషాలు ఆలస్యంగా రైళ్లు

మెట్రో రైలు ట్రాక్‌పై సెల్‌ఫోన్ పడిపోవడంతో దానిని తీసుకునేందుకు మహిళ 750 కేవీ విద్యుత్ ప్రవహించే ట్రాక్ మధ్యలోకి దూకేసింది. బెంగళూరులో జరిగిందీ షాకింగ్ ఘటన. ఇందిరానగర్ మెట్రో స్టేషన్‌లో ఉదయం 6.45 గంటలకు ఈ ఘటన జరిగింది. మహిళ ట్రాక్ మధ్యలోకి దూకడాన్ని గుర్తించిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూముకు సమాచారం అందించడంతోపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. 

ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్లు 15 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్టు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ట్రాక్‌పై పడిపోయిన ఫోన్‌ను తీసుకున్న మహిళ మరో ప్రయాణికురాలి సాయంతో తిరిగి ప్లాట్‌ఫాంపైకి చేరుకుంది. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో రైళ్లు యథావిధిగా నడిచాయి.

  • Loading...

More Telugu News