Gautam Adani: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ

Karan Adani meets CM Revanth Reddy

  • సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కరణ్ అదానీ
  • రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని తెలిపిన అదానీ ప్రతినిధులు
  • పరిశ్రమలకు తగిన వసతులు, రాయితీలను కల్పిస్తామని సీఎం హామీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు కలిశారు. సచివాలయంలో వారు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ పరిశ్రమలకు తగిన వసతులు... రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News