Jagan: రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్న జగన్

Jagan going to Lotus Pond house after 2 years

  • కేసీఆర్ ను పరామర్శించిన జగన్
  • కేసీఆర్ నివాసంలో భోజనం చేయనున్న ఏపీ సీఎం
  • అనంతరం లోటస్ పాండ్ లో తన తల్లిని కలవనున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ కు వచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇటీవల హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నివాసంలోనే ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. లోటస్ పాండ్ లో ఉన్న తన తల్లి విజయమ్మను జగన్ కలవనున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News