ED: తనిఖీలకు వెళ్తున్న ఈడీ బృందంపై దాడి.. టీఎంసీ నేత అరెస్ట్

Enforcement Directorate team attacked in West Bengal

  • రేషన్ పంపిణీ కుంభకోణం ఆరోపణలపై తనిఖీకి ఈడీ బృందం
  • అధికారులు, సాయుధ బలగాలను చుట్టుముట్టి దాడి చేసిన 200 మందికిపైగా స్థానికులు
  • గాయపడిన అధికారులు ఆసుపత్రికి తరలింపు
  • టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్ట్

పశ్చిమబెంగాల్‌, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాళీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి జరిగింది. రేషన్ పంపిణీ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ఈడీ అధికారులు దాడులకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తృణమూల్ నేత షాజహాన్ షేక్ నివాసం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు, సాయుధ బలగాలను చుట్టుముట్టిన 200 మందికిపైగా స్థానికులు ఈ దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఈడీ అధికారులను ఆసుపత్రికి తరలించారు. 

అధికారులపై దాడిచేసిన స్థానికులు వారు ప్రయాణిస్తున్న వాహనాలపైనా దాడిచేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. రోహింగ్యాల వల్ల రాష్ట్రంలోని శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన చెప్పకనే చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కోరారు. ఈడీ అధికారులపై దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News