Chandrababu: కనిగిరిలో 'రా కదలిరా' సభ... ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లిన చంద్రబాబు

Chandrababu leaves for Kanigiri in helicopter

  • నేటి నుంచి ఈ నెల 29 వరకు 'రా కదలిరా' సభలు
  • రాష్ట్రవ్యాప్తంగా 22 సభలు
  • ఇవాళ కనిగిరిలో తొలి సభ

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ముమ్మరంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే 'రా కదలిరా' పేరిట కార్యాచరణ రూపొందించారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు వివిధ ప్రాంతాల్లో 22 సభలు నిర్వహించనున్నారు. ఇవాళ కనిగిరిలో తొలి సభ జరగనుంది. ఈ సభ కోసం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ లో పయనమయ్యారు. ఈ హెలికాప్టర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి బయల్దేరింది. 

కాగా, కనిగిరి సభ కోసం టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. పొత్తు నేపథ్యంలో ఈ సభకు జనసేన శ్రేణులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. 'రా కదలిరా' సభల్లో కొన్నింటికి చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News