Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్

Former governor Narasimhan meets CM Revanth Reddy

  • సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ గవర్నర్
  • ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్
  • 2009 నుంచి 2019 వరకు గవర్నర్‌గా ఉన్న నరసింహన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలిశారు. శనివారం నాడు తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని ఆయన కలిశారు. నరసింహన్ మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో ఆయన ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా వచ్చారు. 2009 నుంచి రాష్ట్రం విడిపోయే వరకు గవర్నర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు తెలంగాణకు, ఎపీకి కూడా గవర్నర్‌గా పని చేశారు. 

  • Loading...

More Telugu News