MLC Election: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్

Telangana MLC Election Notification For Two Seats Released Today
  • రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ
  • ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ
  • 29 న పోలింగ్.. సాయంత్రం ఓట్ల లెక్కింపు
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్యే కోటాకు చెందిన ఈ సీట్లకు ఈ నెల 29 న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించి, 19న పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా ఈ రెండు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
MLC Election
legislative council
Election Notification
Telangana
Two MLC Seats
Kadiam Srihari
Padi kaushik reddy

More Telugu News