Nara Lokesh: సింహాద్రి అప్పన్న సేవలో నారా లోకేశ్

Nara Lokesh visits Simhadri Appanna Temple

  • లోకేశ్‌కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు
  • బేడ మండపం వద్ద ప్రదక్షిణలు
  • లోకేశ్ పేరిట స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఉదయం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న లోకేశ్ బేడ మండపం వద్ద ప్రదక్షిణ చేశారు. అనంతరం అంతరాలయంలో స్వామిని దర్శించుకున్నారు. లోకేశ్ పేరిట అర్చకులు స్వామివారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు లోకేశ్‌కు స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. లోకేశ్‌తోపాటు పలువురు నాయకులు కూడా పూజలో పాల్గొన్నారు.     

శంఖారావం యాత్రలో భాగంగా లోకేశ్ నిన్న విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలంలోని కృష్ణరాయపురం, భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిట్టివలస, విజయనగరం జిల్లా సోంపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

  • Loading...

More Telugu News