TSEAPCET: లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో ముందుగానే ఈఏపీసెట్.. లేటుగా ఈసెట్

Telangana govt postpones ICET exams and TSEAPCET starts from May 7th

  • షెడ్యూల్ ప్రకారం మే 9 నుంచి 12 వరకు టీఎస్ఈఏపీసెట్
  • మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 7 నుంచే పరీక్షలు మొదలు
  • ఐసెట్‌ జూన్ 5, 6 తేదీలకు మార్పు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించాల్సిన పలు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయగా, మరికొన్నింటిని ముందుగానే నిర్వహించాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (వెటర్నరీ మొదలైనవి) కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 9 నుంచి 12 వరకు జరగాల్సి ఉంది. 

రాష్ట్రంలో మే 13 నుంచి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్పుచేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా..  మే 9, 10, 11 ఇంజనీరింగ్ తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహించాల్సి ఉండగా, జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐసెట్‌ను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు గమనించాలని కోరింది.

  • Loading...

More Telugu News