Congress: ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

Congress public meeting in April first week in Thukkuguda

  • సభకు హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్న ఖర్గే
  • ఈ సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడి

తెలంగాణ కాంగ్రెస్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీలతో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ సభలో పాల్గొననున్నట్లు తెలిపింది. ఈ సభను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేశారు. అయితే ఈ సభలో ఈ మేనిఫెస్టోను తెలుగులో మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఏర్పాటు చేస్తున్న ఈ సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News