Dhulipala Narendra Kumar: పొన్నూరులో రూ. 2,500 కోట్ల సహజ వనరులను దోచుకున్నారు: ధూళిపాళ్ల

Dhulipalla fires on Ponnur MLA Kilaru

  • వైసీపీ ఐదేళ్ల పాలనలో అంతులేని అవినీతి చోటుచేసుకుందన్న ధూళిపాళ్ల
  • ఎమ్మెల్యే రోశయ్య దళితుల భూమిని లాక్కున్నారని ఆరోపణ
  • పొన్నూరును గంజాయికి అడ్డాగా మార్చారని మండిపాటు

ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల పాలనలో అంతులేని అవినీతి చోటుచేసుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గంలోనే రూ. 2,500 కోట్లు పైగా విలువైన సహజవనరులను దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య దళితులను బెదిరించి అనుమర్లపూడిలో వారి భూమిని లాక్కున్నారని అన్నారు. రేషన్ మాఫియా లారీకి అడ్డొచ్చారని ఒక ఉద్యోగిని హతమార్చారని చెప్పారు. పొన్నూరును గంజాయికి అడ్డాగా మార్చారని విమర్శించారు. ఇంత జరిగినా ఎమ్మెల్యేపై జగన్ చర్చలు తీసుకోలేదని చెప్పారు. పొన్నూరులో రోడ్డు విస్తరణ బాధితులకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News