G. Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Kishan Reddy open letter to Revanth Reddy

  • ఎవరి హయాంలో ఎన్ని నిధులు వచ్చాయో తెలుసుకోవడానికి చర్చకు ఆహ్వానిస్తూ లేఖ
  • 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు వచ్చాయి?
  • 2014 నుంచి 2024 వరకు ఎన్డీయే హయాంలో ఎన్ని నిధులు వచ్చాయి?
  • చర్చిద్దాం రావాలంటూ ఆహ్వానం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని.. ఈ పదేళ్ల కాలంలో గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి తన ప్రచార సభలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు.

పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారు? పదేళ్ల ఎన్డీయే హయాంలో ఎంత ఇచ్చారు? తేల్చుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? 2014 నుంచి 2024 వరకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎన్ని?  చర్చకు ఆహ్వానిస్తూ ఆయన లేఖ రాశారు.

  • Loading...

More Telugu News