K Kavitha: కవితకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Kavitha Judicial remand extended
  • ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
  • జైల్లో చదువుకోవడానికి పుస్తకాలు అడిగిన కవిత
  • కవిత విజ్ఞప్తికి కోర్టు ఆమోదం
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో రిమాండ్‌ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి తనకు పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరింది. ఆమె విజ్ఞప్తికి కోర్టు ఆమోదం తెలిపింది. కవితకు జైల్లో ఎనిమిది పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు, మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
K Kavitha
Delhi Liquor Scam
BRS

More Telugu News