Crime: తండ్రిని కడతేర్చిన కుమార్తె... నచ్చని పెళ్లి సంబంధం తీసుకువచ్చాడని ఘాతుకం

Daughter killed father in Annamayya district

  • అన్నమయ్య జిల్లాలో ఘోరం
  • మదనపల్లె జీఆర్టీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న దొరస్వామి
  • కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వైనం
  • కుమార్తె వద్దని చెప్పినా ఓ సంబంధం ఖాయం చేసేందుకు యత్నం
  • చపాతీ కర్ర, ఇనుపరాడ్డుతో తండ్రిని కొట్టి చంపిన కుమార్తె

అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. ఓ యువతి కన్నతండ్రినే కడతేర్చింది. అసలేం జరిగిందంటే... మదనపల్లె జీఆర్టీ స్కూల్లో దొరస్వామి అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పెళ్లీడుకు వచ్చిన కుమార్తెను ఓ ఇంటిదాన్ని చేసేందుకు ఆయన సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. 

ఓ సంబంధం తీసుకువచ్చేందుకు దొరస్వామి ప్రయత్నించారు. ఆ సంబంధం తనకు నచ్చలేదని, తీసుకురావొద్దని కుమార్తె చెప్పింది. అయిన్పటికీ ఆ ఉపాధ్యాయుడు వినిపించుకోలేదు. 

దాంతో  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్తె... చపాతీలు చేసే కర్రతోనూ, ఇనుపరాడ్డుతోనూ తండ్రిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన తండ్రి దొరస్వామి మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు ఆ ఉపాధ్యాయుడి కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News