YS Sharmila: ఢిల్లీలో సోనియా, రాహుల్, ప్రియాంకలను కలిసిన షర్మిల

Sharmila Tweets After Key Meeting with Gandhi Family

  • నేడు ఢిల్లీలో షర్మిల పర్యటన
  • గాంధీల కుటుంబంతో భేటీ
  • ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలపై చర్చ
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పునర్ వైభవం దిశగా అడుగులు పడతాయన్న షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెప్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కలిశారు. ఈ భేటీ సోనియా నివాసంలో జరిగింది. ఈ సమావేశంపై షర్మిల ట్వీట్ చేశారు.

"సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలోని వారి నివాసంలో కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆసక్తికరమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా... భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ తీరుతెన్నులు, ఇతర అంశాలపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం సంపాదించుకోవడమే కాదు ఒక బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. ఈ దిశగా మరిన్ని అడుగులు పడనున్నాయన్న విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను" అని షర్మిల వివరించారు. గాంధీల కుటుంబంతో తన భేటీకి సంబంధించిన ఫొటోను కూడా షర్మిల పంచుకున్నారు.

  • Loading...

More Telugu News