AP Assembly: ముగిసిన బీఏసీ సమావేశం.. హాజరు కాని వైసీపీ.. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే..!

AP BAC meeting

  • స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం
  • టీడీపీ తరపున హాజరైన చంద్రబాబు, పయ్యావుల కేశవ్
  • ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ హాజరు కాగా... జనసేన తరపున నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బీఏసీ సమావేశానికి వైసీపీ హాజరుకాలేదు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో శ్వేతపత్రాలను విడుదల చేయాలని అధికార పక్షం ప్రతిపాదించింది.

  • Loading...

More Telugu News