Ganja: భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు .. ఐదుగురి అరెస్టు

Guntur Police Siezed 230 Kilo Ganja

  • విశాఖ నుంచి తమిళనాడుకు గంజాయి అక్రమ రవాణ
  • గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ
  • రెండు కార్లు సీజ్, 230 కిలోల గంజాయి స్వాధీనం 

గంజాయి వినియోగం, అక్రమ రవాణను అరికట్టేందుకు ఏపీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే వాహనాల తనిఖీల్లో గంజాయి పట్టుబడుతోంది. పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి అక్రమ రవాణాపై కేసులు నమోదు చేస్తున్నా కొందరు అక్రమార్కులు అధికారుల కళ్లు గప్పి రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా, నిన్న గుంటూరు జిల్లాలో సెబ్ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ నుంచి తమిళనాడుకు రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో సెబ్ అధికారులు మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేశారు. రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించి ఆ వాహనాలను సీజ్ చేశారు. అయిదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ అయిదుగురు వ్యక్తులు గత కొంత కాలంగా విశాఖ నుంచి గంజాయి తీసుకొస్తున్నట్టు సెబ్ అధికారులు గుర్తించారు.  

  • Loading...

More Telugu News