Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫొటోకి పూజ చేసి వరినాట్లు వేసిన రైతు

pawan kalyan photo poooja at ap video goes viral

  • తమిళనాడు సంస్కృతిి ఏపీలోకి
  • సినీ సెలబ్రిటీలను ఆరాధిస్తున్న అభిమానులు
  • జనసేన భారీ విజయంతో పవన్ పై ఫ్యాన్స్‌లో పెరిగిన అభిమానం

సాధారణంగా రైతాంగం వ్యవసాయ పనులు ఆరంభించే ముందు తాము నమ్మిన దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు, ప్రజలకు ఈ విషయం తెలుసు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే .. ఓ రైతు తన పొలంలో వరి నాట్లు వేసే ముందు భగవంతుడికి కాకుండా పవన్ కల్యాణ్ చిత్రపటానికి పూజలు చేయడం. అందుకు సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  
 
ఈ పరిణామంతో పవన్ కల్యాణ్‌కు కేవలం అభిమానులే కాదు భక్తులు కూడా ఉన్నారన్న చర్చ సాగుతోంది. తమిళనాడులో నటీనటులకు అభిమానులు గుడి కట్ట పూజలు చేయడం ఉంది. ఇప్పుడు ఆ సంస్కృతి ఏపీకి పాకింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కల్యాణ్ .. ఆ తర్వాత తన వ్యక్తిగతమైన ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ స్టార్ ట్యాగ్ తో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కల్యాణ్‌కు ఎక్కువే.

  • Loading...

More Telugu News