Roja: పార్టీ మారిన వాళ్లు ఏమయ్యారో కళ్లారా చూశాం: రోజా

Roja talks about leaders who leaving YSRCP

  • వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు
  • ఎమ్మెల్సీలు పార్టీకే కాకుండా, పదవికి కూడా రాజీనామా చేస్తున్న వైనం
  • వాళ్లు ఎందుకు వెళ్లిపోతున్నారో ఓసారి ఆలోచించుకోవాలన్న రోజా
  • పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వాళ్లను ఎవరూ గౌరవించరని వెల్లడి 

వైసీపీకి రాజీనామా చేస్తున్న వారి సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతోంది. ఎమ్మెల్సీలు సైతం పార్టీకి, పదవికి రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. దీనిపై మాజీ మంత్రి రోజా స్పందించారు.

 పార్టీ నుంచి వెళ్లిపోవడం ఇదేమీ కొత్త కాదని, 2014 నుంచి 2019 వరకు విపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నుంచి కొందరు వెళ్లిపోయారని వెల్లడించారు. పార్టీ మారిన వాళ్లు ఏమయ్యారో కూడా కళ్లారా చూశామని అన్నారు. 

"పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్లు, పార్టీ ద్వారా నియమించబడిన వాళ్లు తామ ఎందుకు వెళ్లిపోతున్నామన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. దీని వల్ల జగనన్నకు, వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వాళ్లను ఎవరూ గౌరవించరు, క్షమించరు" అని రోజా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News