Tirumala: శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం... టీటీడీ కీలక నిర్ణయం

TTD to do Maha Shanthi Yagam at Tirumala

  • ఆగమ సలహాదారులు, అధికారులతో ఈవో శ్యామలరావు భేటీ
  • లడ్డూ కల్తీ అయిందన్న నేపథ్యంలో సలహా కోరిన అధికారులు
  • మహాశాంతి యాగం నిర్వహించాలని సూచించిన ఆగమశాస్త్ర పండితులు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంలో భాగంగా శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆగమసలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు సమావేశమయ్యారు.

శ్రీవారి లడ్డూ కల్తీ అయిందన్న నేపథ్యంలో, ఆగమశాస్త్రాలపరంగా సూచనలు ఇవ్వాలని కోరారు. దీంతో మహాశాంతి యాగం నిర్వహించాలని ఆగమశాస్త్ర పండితులు సూచించారు. వచ్చే సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News