Tirumala Laddu: శ్రీవారి లడ్డూ ప్రసాదం.. చంద్రబాబుకు నివేదిక సమర్పించిన ఈవో

Tirumala Laddu Row TTD EO Shyamala Rao Gave Report To CM

  • దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డూ వివాదం
  • చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టీటీడీ ఈవో శ్యామలరావు
  • విస్తృత సంప్రదింపుల అనంతరం ఆలయ సంప్రోక్షణ విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయం

తిరుమల లడ్డూ వివాదం దేశాన్ని కుదిపేస్తోంది. సామాన్యుల నుంచి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు. తిరుమలను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూ అంశంపై  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె.శ్యామలరావు నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని నేడు టీటీడీ అధికారులు అందించనున్నారు.

ఈవో అందించిన నివేదికపై నిన్న మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ..  ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారులు, అర్చకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఆలయ సంప్రోక్షణ విషయంలో మరింత విస్తృత సంప్రదింపుల అనంతరం చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News