South Central Railway: అయ్యప్ప భక్తుల నుంచి స్పందన కరవు.. శబరిమల ప్రత్యేక రైళ్ల రద్దు

- ప్రకటించిన 14 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- మహాకుంభమేళాకు 16 ప్రత్యేక రైళ్ల ప్రకటన
- 20 ప్రత్యేక రైళ్లు మరికొన్ని నెలల పాటు పొడిగింపు
అయ్యప్ప భక్తుల నుంచి స్పందన కరవవడంతో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రకటించిన 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శబరిమల రద్దీ నేపథ్యంలో మౌలాలి-కొట్టాయం, కాగజ్నగర్-కొల్లాం, కాచిగూడ-కొట్టాయం, నర్సాపూర్-కొల్లాం, నాంపల్లి-కొట్టాయం మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే, అయ్యప్ప భక్తుల నుంచి అనుకున్నంతగా స్పందన లేకపోవడంతో ఈ రైళ్లను రద్దు చేసినట్టు తాజాగా ప్రకటించింది.
మరోవైపు, జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానున్న మహాకుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 18, 21 తేదీల్లో మౌలాలి-అజాంగఢ్, 20, 23 తేదీల్లో అజాంగఢ్-మౌలాలి, 19న మౌలాలి-గయ, 21న గయ-మౌలాలి, 22న మౌలాలి-గయ, 24న గయ-మౌలాలి, 25న కాచిగూడ-పట్నా, 27న పట్నా-కాచిగూడ మధ్య రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.
అలాగే, హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే 20 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్టు అధికారులు చెప్పారు. వీటిలో సికింద్రాబాద్-రామాంతపురం-సికింద్రాబాద్ రైలును జనవరి 29 నుంచి మార్చి 28 వరకు, కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును జనవరి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు, నాందేడ్-ఈరోడ్-నాందేడ్ రైలును జనవరి 24 నుంచి మార్చి 30 వరకు, కాచిగూడ-నాగర్కోయల్-కాచిగూడ రైలును జనవరి 24 నుంచి మార్చి 30 వరకు పొడిగించినట్టు అధికారులు వివరించారు.
మరోవైపు, జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానున్న మహాకుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 18, 21 తేదీల్లో మౌలాలి-అజాంగఢ్, 20, 23 తేదీల్లో అజాంగఢ్-మౌలాలి, 19న మౌలాలి-గయ, 21న గయ-మౌలాలి, 22న మౌలాలి-గయ, 24న గయ-మౌలాలి, 25న కాచిగూడ-పట్నా, 27న పట్నా-కాచిగూడ మధ్య రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.
అలాగే, హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే 20 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్టు అధికారులు చెప్పారు. వీటిలో సికింద్రాబాద్-రామాంతపురం-సికింద్రాబాద్ రైలును జనవరి 29 నుంచి మార్చి 28 వరకు, కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును జనవరి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు, నాందేడ్-ఈరోడ్-నాందేడ్ రైలును జనవరి 24 నుంచి మార్చి 30 వరకు, కాచిగూడ-నాగర్కోయల్-కాచిగూడ రైలును జనవరి 24 నుంచి మార్చి 30 వరకు పొడిగించినట్టు అధికారులు వివరించారు.