Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

Another record in Kohlis account 550 international matches completed
  • విరాట్ కోహ్లీ 550 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి.
  • సచిన్ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడిగా రికార్డు.
  • ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌లో కోహ్లీ.
  • వన్డేల్లో 58.11 సగటుతో 14,180 పరుగులు.
దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతున్న సమయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇది కోహ్లీ ఆడుతున్న వరుసగా మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. అంతేకాకుండా 550 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండవ భారత ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్‌లు) మాత్రమే అతని కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు.

2013లో రిటైర్ అయిన సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. కోహ్లీ ఇప్పటివరకు 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫైనల్‌కు ముందు నాలుగు మ్యాచ్‌లలో ఒక సెంచరీతో సహా 217 పరుగులు చేశాడు.

వన్డేల్లో కోహ్లీ ఇప్పటివరకు 58.11 సగటుతో 14,180 పరుగులు చేశాడు. అంతేకాకుండా 51 సెంచరీలు సాధించి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.

ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ కోహ్లీని 50 ఓవర్ల ఫార్మాట్‌కు తిరుగులేని రాజుగా అభివర్ణించాడు. కోహ్లీ తన ఆటను మెరుగుపరచడానికి ప్రయత్నించాడని, దాని వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెప్పాడు. అయితే ఇప్పుడు అతను తన సహజమైన ఆటను ఆడుతున్నాడని, సింగిల్స్ తీస్తూ, బంతిని అనవరంగా గాల్లోకి లేపకుండా, అవసరమైతేనే భారీ షాట్లు కొడుతున్నాడని అన్నాడు. 

కోహ్లీ తన ఆటలో ఎల్లప్పుడూ శక్తిని చూపిస్తూ, ప్రతి బంతిని ఆడుతూ క్రీజులో నిలదొక్కుకుంటాడని రవిశాస్త్రి కొనియాడాడు.
Virat Kohli
Cricket
Sachin Tendulkar
Team India

More Telugu News