Anita Vangalapoodi: నేను హోంమంత్రిని అయినా మా అమ్మాయి భద్రత పట్ల ఆందోళనగానే ఉంటుంది: అనిత

- విశాఖలో 'మహిళా రక్షణకు కలసికట్టుగా' కార్యక్రమం ప్రారంభం.
- హాజరైన హోంమంత్రి అనిత
- ఆడపిల్లల భద్రతపై మాట్లాడిన హోంమంత్రి
సమాజంలో మహిళలు, ఆడపిల్లల భద్రతపై నెలకొన్న పరిస్థితుల పట్ల ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాను రాష్ట్ర హోంమంత్రి అయినప్పటికీ, తన పిల్లలు బయటకు వెళ్తే వారి భద్రత గురించి భయపడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.
విశాఖపట్నంలో మంగళవారం 'మహిళా రక్షణకు కలసికట్టుగా' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి అనిత మాట్లాడారు. "ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. సాయంత్రం 6 గంటల తర్వాత ఆడపిల్లల్ని బయటకు పంపాలంటేనే భయమేస్తోంది. నేను రాష్ట్ర హోంమంత్రి పదవిలో ఉన్నాను. అయినా సరే, నా పిల్లలు ఎక్కడికైనా వెళ్తే వెంటనే లైవ్ లొకేషన్ షేర్ చేయమని అడుగుతాను. సమాజంలో పరిస్థితులు అంత దారుణంగా తయారయ్యాయి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పోక్సో కేసులపై ఆందోళనకర గణాంకాలు
రాష్ట్రంలో నమోదవుతున్న పోక్సో కేసుల గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అనిత తెలిపారు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారిలో ఎక్కువ మంది యువత, మైనర్లే ఉండటం విచారకరమన్నారు. "పోక్సో కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో దాదాపు 60 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే ఉంటున్నారు. మరో 20 శాతం మంది 20 ఏళ్ల లోపు వయసు వారు ఉంటున్నారు. అంటే మొత్తం నిందితుల్లో 80 శాతం మంది 20 ఏళ్ల లోపు వారే" అని మంత్రి గణాంకాలను వివరించారు.
యువతలో మార్పు రావాలి
యువతలో నేర ప్రవృత్తి పెరగడం, మహిళల పట్ల గౌరవం తగ్గడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హోం మంత్రి అనిత అన్నారు. దీని కోసం విద్యాసంస్థల్లో పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, బాధ్యతలను పెంపొందించేందుకు స్వీయ క్రమశిక్షణను పాఠ్యాంశంగా చేర్చే ఆలోచన కూడా ఉందని వెల్లడించారు. మహిళలు, బాలికల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
విశాఖపట్నంలో మంగళవారం 'మహిళా రక్షణకు కలసికట్టుగా' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి అనిత మాట్లాడారు. "ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. సాయంత్రం 6 గంటల తర్వాత ఆడపిల్లల్ని బయటకు పంపాలంటేనే భయమేస్తోంది. నేను రాష్ట్ర హోంమంత్రి పదవిలో ఉన్నాను. అయినా సరే, నా పిల్లలు ఎక్కడికైనా వెళ్తే వెంటనే లైవ్ లొకేషన్ షేర్ చేయమని అడుగుతాను. సమాజంలో పరిస్థితులు అంత దారుణంగా తయారయ్యాయి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పోక్సో కేసులపై ఆందోళనకర గణాంకాలు
రాష్ట్రంలో నమోదవుతున్న పోక్సో కేసుల గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అనిత తెలిపారు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారిలో ఎక్కువ మంది యువత, మైనర్లే ఉండటం విచారకరమన్నారు. "పోక్సో కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో దాదాపు 60 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే ఉంటున్నారు. మరో 20 శాతం మంది 20 ఏళ్ల లోపు వయసు వారు ఉంటున్నారు. అంటే మొత్తం నిందితుల్లో 80 శాతం మంది 20 ఏళ్ల లోపు వారే" అని మంత్రి గణాంకాలను వివరించారు.
యువతలో మార్పు రావాలి
యువతలో నేర ప్రవృత్తి పెరగడం, మహిళల పట్ల గౌరవం తగ్గడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హోం మంత్రి అనిత అన్నారు. దీని కోసం విద్యాసంస్థల్లో పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, బాధ్యతలను పెంపొందించేందుకు స్వీయ క్రమశిక్షణను పాఠ్యాంశంగా చేర్చే ఆలోచన కూడా ఉందని వెల్లడించారు. మహిళలు, బాలికల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.