Paresh Rawal: అజయ్ దేవగణ్ తండ్రి నాకు ఇచ్చిన షాకింగ్ సలహా ఇదే: నటుడు పరేష్ రావల్

- గతంలో ఓసారి గాయపడిన నటుడు పరేష్ రావల్
- పరామర్శించేందుకు వచ్చిన అజయ్ దేవగణ్ తండ్రి వీరూ దేవగణ్
- స్వమూత్ర పానం చేయాలని సలహా ఇచ్చాడని పరేష్ రావల్ వెల్లడి
- ఆయన చెప్పినట్టే చేశానని, విరిగిన ఎముక అతుక్కుందని వివరణ
- డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారని వెల్లడి
బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ తాజాగా ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో ఆశ్చర్యపరిచే విషయాన్ని వెల్లడించారు. తాను గతంలో గాయపడినప్పుడు, త్వరగా కోలుకోవడం కోసం ఏకంగా 15 రోజుల పాటు తన మూత్రాన్ని తానే సేవించినట్లు తెలిపారు. ఈ వింత అనుభవాన్ని ఆయన ఇండియా టుడే అనుబంధ చానెల్ 'లల్లన్టాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
గతంలో తాను గాయపడి ముంబయిలోని నానావతి మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరినట్లు పరేష్ రావల్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో, ప్రముఖ యాక్షన్ డైరెక్టర్, అజయ్ దేవగణ్ తండ్రి అయిన వీరూ దేవగణ్ తనను పరామర్శించడానికి వచ్చారని చెప్పారు. త్వరగా కోలుకోవాలంటే ప్రతిరోజూ ఉదయం వచ్చే మొదటి మూత్రాన్ని సేవించాలని వీరూ దేవగణ్ తనకు సలహా ఇచ్చారని పరేష్ రావల్ వివరించారు. అంతేకాకుండా, చికిత్స సమయంలో మద్యం, రెడ్ మీట్, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలని కూడా సూచించినట్లు తెలిపారు.
వీరూ దేవగణ్ ఇచ్చిన సలహాను పాటించాలని నిర్ణయించుకున్నానని పరేష్ రావల్ తెలిపారు. "ఒకేసారి గటగటా తాగేయకుండా, బీర్ తాగినట్లు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలని అనుకున్నాను. ఎందుకంటే ఆ పనిని సరిగ్గా చేయాలనుకున్నాను" అని ఆయన ఆనాటి తన ఆలోచనను పంచుకున్నారు. ఈ విధంగా ఏకధాటిగా 15 రోజుల పాటు తాను మూత్రాన్ని సేవించినట్లు వెల్లడించారు.
15 రోజుల తర్వాత వైద్యులు తన ఎక్స్-రే చూసి దిగ్భ్రాంతికి గురయ్యారని పరేష్ రావల్ చెప్పారు. "ఈ సిమెంటింగ్ (ఎముక అతుక్కోవడం) ఇంత వేగంగా ఎలా జరిగింది?" అని డాక్టర్ ఆశ్చర్యపోయారని తెలిపారు. ఎక్స్-రేలో తెల్లటి గీత ఏర్పడటం స్పష్టంగా కనిపించిందని డాక్టర్ చెప్పినట్లు రావల్ వివరించారు. వాస్తవానికి తాను రెండు, రెండున్నర నెలల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉండగా, కేవలం నెలన్నరలోనే ఇంటికి పంపించారని, ఇదంతా ఒక అద్భుతంలా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, పరేష్ రావల్ చివరిగా 'ది స్టోరీటెల్లర్' చిత్రంలో తారిణి బందోపాధ్యాయ్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన 'భూత్ బంగ్లా', 'థామా', 'హేరా ఫేరీ 3' వంటి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. పరేష్ రావల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
గతంలో తాను గాయపడి ముంబయిలోని నానావతి మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరినట్లు పరేష్ రావల్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో, ప్రముఖ యాక్షన్ డైరెక్టర్, అజయ్ దేవగణ్ తండ్రి అయిన వీరూ దేవగణ్ తనను పరామర్శించడానికి వచ్చారని చెప్పారు. త్వరగా కోలుకోవాలంటే ప్రతిరోజూ ఉదయం వచ్చే మొదటి మూత్రాన్ని సేవించాలని వీరూ దేవగణ్ తనకు సలహా ఇచ్చారని పరేష్ రావల్ వివరించారు. అంతేకాకుండా, చికిత్స సమయంలో మద్యం, రెడ్ మీట్, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలని కూడా సూచించినట్లు తెలిపారు.
వీరూ దేవగణ్ ఇచ్చిన సలహాను పాటించాలని నిర్ణయించుకున్నానని పరేష్ రావల్ తెలిపారు. "ఒకేసారి గటగటా తాగేయకుండా, బీర్ తాగినట్లు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలని అనుకున్నాను. ఎందుకంటే ఆ పనిని సరిగ్గా చేయాలనుకున్నాను" అని ఆయన ఆనాటి తన ఆలోచనను పంచుకున్నారు. ఈ విధంగా ఏకధాటిగా 15 రోజుల పాటు తాను మూత్రాన్ని సేవించినట్లు వెల్లడించారు.
15 రోజుల తర్వాత వైద్యులు తన ఎక్స్-రే చూసి దిగ్భ్రాంతికి గురయ్యారని పరేష్ రావల్ చెప్పారు. "ఈ సిమెంటింగ్ (ఎముక అతుక్కోవడం) ఇంత వేగంగా ఎలా జరిగింది?" అని డాక్టర్ ఆశ్చర్యపోయారని తెలిపారు. ఎక్స్-రేలో తెల్లటి గీత ఏర్పడటం స్పష్టంగా కనిపించిందని డాక్టర్ చెప్పినట్లు రావల్ వివరించారు. వాస్తవానికి తాను రెండు, రెండున్నర నెలల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉండగా, కేవలం నెలన్నరలోనే ఇంటికి పంపించారని, ఇదంతా ఒక అద్భుతంలా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, పరేష్ రావల్ చివరిగా 'ది స్టోరీటెల్లర్' చిత్రంలో తారిణి బందోపాధ్యాయ్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన 'భూత్ బంగ్లా', 'థామా', 'హేరా ఫేరీ 3' వంటి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. పరేష్ రావల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.