Siddaramaiah: బహిరంగ కార్యక్రమంలో పోలీస్ ఆఫీసర్పై చేయి ఎత్తిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ఇదిగో వీడియో

- బెలగావిలో జరిగిన 'సేవ్ కానిస్టిట్యూషన్' సభలో ఘటన
- భద్రతా లోపంపై పోలీసు అధికారిపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం
- వేదికపైకి పిలిచి, మందలించి, చేయ్యెత్తిన ముఖ్యమంత్రి
- సీఎం తీరు అహంకారపూరితమంటూ జేడీఎస్, బీజేపీల విమర్శలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బహిరంగ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారి పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. బెలగావిలో సోమవారం జరిగిన 'సేవ్ కానిస్టిట్యూషన్' కార్యక్రమంలో భద్రతా వైఫల్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని వేదిక పైకి పిలిచి మందలించడమే కాకుండా, ఆయనపై చేయి ఎత్తారు.
'సేవ్ కానిస్టిట్యూషన్' పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు నల్ల కండువాలతో అక్కడికి చేరుకుని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా ప్రాంగణంలో ఈ నిరసన జరగడంతో భద్రతా లోపం జరిగిందని భావించిన ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి గురయ్యారు.
వెంటనే వేదిక భద్రతను పర్యవేక్షిస్తున్న ఏఎస్పీని వేదిక పైకి రావాలని ఆగ్రహంగా పిలిచారు. "నువ్వే, ఇటు రా.. ఏం చేస్తున్నావ్?" అని ప్రశ్నిస్తూ, ఆయనపై చేయి ఎత్తినట్లు కనిపించారు. వెంటనే తనను తాను నియంత్రించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ముఖ్యమంత్రి తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ముఖ్యమంత్రి అహంకారపూరితంగా, దురుసుగా ప్రవర్తించారని జేడీఎస్ ఆరోపించింది. ఒక ప్రభుత్వ అధికారి పట్ల బహిరంగంగా, ఏకవచనంతో మాట్లాడటం, చేయి చేసుకోవడానికి ప్రయత్నించడం "క్షమించరాని నేరం" అని పేర్కొంది. "మీ అధికార కాలం కేవలం 5 ఏళ్లే. కానీ ప్రభుత్వ అధికారి 60 ఏళ్ల వయసు వరకు సేవ చేస్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మీ దుష్ప్రవర్తనను సరిదిద్దుకోండి" అని జేడీఎస్ పార్టీ ఎక్స్ వేదికగా హితవు పలికింది.
ఖండించిన బీజేపీ నేతలు
కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి కూడా ఈ ఘటనను ఖండించారు. "కాంగ్రెస్ ప్రభుత్వం దుష్పరిపాలనలోనే కాదు, అహంకారంలోనూ అన్ని హద్దులు దాటింది. అధికార మత్తులో, విధి నిర్వహణలో ఉన్న అధికారిపై చేయి చేసుకునేంత ధైర్యం ముఖ్యమంత్రికి వచ్చింది. చట్ట పరిరక్షకులపై చేయి చేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడతామని నటిస్తున్నారు. ఇది తీవ్రమైన ప్రవర్తన, అహంకారం. ఇది ఖండించదగినది" అని ఆయన అన్నారు.
మరో కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే మాట్లాడుతూ, "బెలగావి సభలో సీఎం సిద్ధరామయ్య పోలీసు అధికారిపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇలా చేయడం ద్వారా ముఖ్యమంత్రి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది" అని అన్నారు. పాకిస్థాన్ గురించి మంచిగా మాట్లాడటం వల్లే సిద్ధరామయ్య పాకిస్థాన్లో ప్రసిద్ధి చెందారని ఆమె వ్యాఖ్యానించారు.
'సేవ్ కానిస్టిట్యూషన్' పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు నల్ల కండువాలతో అక్కడికి చేరుకుని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా ప్రాంగణంలో ఈ నిరసన జరగడంతో భద్రతా లోపం జరిగిందని భావించిన ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి గురయ్యారు.
వెంటనే వేదిక భద్రతను పర్యవేక్షిస్తున్న ఏఎస్పీని వేదిక పైకి రావాలని ఆగ్రహంగా పిలిచారు. "నువ్వే, ఇటు రా.. ఏం చేస్తున్నావ్?" అని ప్రశ్నిస్తూ, ఆయనపై చేయి ఎత్తినట్లు కనిపించారు. వెంటనే తనను తాను నియంత్రించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ముఖ్యమంత్రి తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ముఖ్యమంత్రి అహంకారపూరితంగా, దురుసుగా ప్రవర్తించారని జేడీఎస్ ఆరోపించింది. ఒక ప్రభుత్వ అధికారి పట్ల బహిరంగంగా, ఏకవచనంతో మాట్లాడటం, చేయి చేసుకోవడానికి ప్రయత్నించడం "క్షమించరాని నేరం" అని పేర్కొంది. "మీ అధికార కాలం కేవలం 5 ఏళ్లే. కానీ ప్రభుత్వ అధికారి 60 ఏళ్ల వయసు వరకు సేవ చేస్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మీ దుష్ప్రవర్తనను సరిదిద్దుకోండి" అని జేడీఎస్ పార్టీ ఎక్స్ వేదికగా హితవు పలికింది.
ఖండించిన బీజేపీ నేతలు
కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి కూడా ఈ ఘటనను ఖండించారు. "కాంగ్రెస్ ప్రభుత్వం దుష్పరిపాలనలోనే కాదు, అహంకారంలోనూ అన్ని హద్దులు దాటింది. అధికార మత్తులో, విధి నిర్వహణలో ఉన్న అధికారిపై చేయి చేసుకునేంత ధైర్యం ముఖ్యమంత్రికి వచ్చింది. చట్ట పరిరక్షకులపై చేయి చేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడతామని నటిస్తున్నారు. ఇది తీవ్రమైన ప్రవర్తన, అహంకారం. ఇది ఖండించదగినది" అని ఆయన అన్నారు.
మరో కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే మాట్లాడుతూ, "బెలగావి సభలో సీఎం సిద్ధరామయ్య పోలీసు అధికారిపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇలా చేయడం ద్వారా ముఖ్యమంత్రి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది" అని అన్నారు. పాకిస్థాన్ గురించి మంచిగా మాట్లాడటం వల్లే సిద్ధరామయ్య పాకిస్థాన్లో ప్రసిద్ధి చెందారని ఆమె వ్యాఖ్యానించారు.