Pawan Kalyan: సింహాచ‌లం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

Simhachalam Temple Tragedy Pawan Kalyan Expresses Grief
  • సింహాచ‌లం దుర్ఘ‌ట‌నపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ దిగ్భ్రాంతి
  • మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జ‌న‌సేనాని
  • బాధితుల‌ను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంద‌ని హామీ  
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘ‌ట‌న‌ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్న జ‌న‌సేనాని... మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. బాధితుల‌ను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంద‌ని, అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. అంద‌రూ ధైర్యంగా ఉండాల‌ని కోరారు. 

అనంత‌రం ఆయ‌న‌ ఈ ఘ‌ట‌న గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత ఘ‌ట‌నాస్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని తెలిపారు. అటు సీఎం చంద్ర‌బాబు కూడా ఈ ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌న్నారు. 
Pawan Kalyan
Simhachalam Temple Tragedy
Andhra Pradesh
Wall Collapse
Temple Festival
Chandanotsavam
Seven Devotees Killed
CM Chandrababu Naidu
Home Minister Anitha
Government Aid

More Telugu News