Lakshman: భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టి.. భయంతో భర్త ఆత్మహత్య

- మధ్యప్రదేశ్ ఖర్గోన్లో భర్త ఘాతుకం
- నాలుగైదు రోజులు శవం పక్కనే నిద్రించిన భర్త
- దుర్వాసనతో విషయం వెలుగులోకి
- భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన భర్త అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బయటపడటంతో భయాందోళనకు గురై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. బర్వాహా పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మణ్ (45), అతని భార్య రుక్మిణీ బాయి (40) నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా వారి ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమానించారు. ఇంటికి వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ మంచంపై లక్ష్మణ్ విగతజీవిగా పడి ఉండటం చూసి గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అదే సమయంలో, మంచానికి సమీపంలో తవ్విన గోతిలో పాక్షికంగా పూడ్చిపెట్టిన రుక్మిణీ బాయి మృతదేహాన్ని గుర్తించారు.
వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రుక్మిణీ బాయి మృతదేహాన్ని వెలికి తీశారు. శరీరం పాక్షికంగా కుళ్లిపోయి ఉండటాన్ని బట్టి, హత్య జరిగి నాలుగైదు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాన్ని సరిగా పూడ్చకపోవడం వల్ల చేయి బయటకు కనిపిస్తోందని, దానివల్లే దుర్వాసన వ్యాపించిందని పోలీసులు తెలిపారు. భార్యను పాతిపెట్టిన తర్వాత లక్ష్మణ్ నాలుగైదు రోజులుగా అదే మంచంపై నిద్రపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది.
భార్య హత్య విషయం బయటపడి, తాను పట్టుబడతాననే భయంతోనే లక్ష్మణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణాలకు సంబంధించిన కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. బర్వాహా పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మణ్ (45), అతని భార్య రుక్మిణీ బాయి (40) నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా వారి ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమానించారు. ఇంటికి వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ మంచంపై లక్ష్మణ్ విగతజీవిగా పడి ఉండటం చూసి గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అదే సమయంలో, మంచానికి సమీపంలో తవ్విన గోతిలో పాక్షికంగా పూడ్చిపెట్టిన రుక్మిణీ బాయి మృతదేహాన్ని గుర్తించారు.
వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రుక్మిణీ బాయి మృతదేహాన్ని వెలికి తీశారు. శరీరం పాక్షికంగా కుళ్లిపోయి ఉండటాన్ని బట్టి, హత్య జరిగి నాలుగైదు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాన్ని సరిగా పూడ్చకపోవడం వల్ల చేయి బయటకు కనిపిస్తోందని, దానివల్లే దుర్వాసన వ్యాపించిందని పోలీసులు తెలిపారు. భార్యను పాతిపెట్టిన తర్వాత లక్ష్మణ్ నాలుగైదు రోజులుగా అదే మంచంపై నిద్రపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది.
భార్య హత్య విషయం బయటపడి, తాను పట్టుబడతాననే భయంతోనే లక్ష్మణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణాలకు సంబంధించిన కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.