RTC JAC: ఈ నెల 7న సమ్మె.. హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ నిరసన ర్యాలీ

- హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుల కవాతు
- చర్చలకు పిలవలేదంటూ జేఏసీ ఆగ్రహం
- ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు కవాతు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) సమ్మెకు సిద్ధమవుతోంది. ఈ నెల 7వ తేదీన తలపెట్టిన సమ్మెకు సన్నాహకంగా కార్మికులు సోమవారం హైదరాబాద్లో భారీ కవాతు నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు బస్ భవన్ వరకు కొనసాగింది. ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ వెంకన్న ఈ సందర్భంగా తెలిపారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాకపోవడంతో అనివార్యంగా సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు చర్చలకు ఆహ్వానించలేదని, అందుకే సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నామని వివరించారు. కవాతు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవాతు సాగిన మార్గంలోనూ, బస్ భవన్ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ వెంకన్న ఈ సందర్భంగా తెలిపారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాకపోవడంతో అనివార్యంగా సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు చర్చలకు ఆహ్వానించలేదని, అందుకే సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నామని వివరించారు. కవాతు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవాతు సాగిన మార్గంలోనూ, బస్ భవన్ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.