Arun Dhumal: ఆపరేషన్ సిందూర్: ఐపీఎల్ కొనసాగుతుందా? విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి?

- ఐపీఎల్ 2025 కొనసాగింపుపై నెలకొన్న సందిగ్ధత
- ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయమన్న బీసీసీఐ, ఐపీఎల్ ఛైర్మన్
- విదేశీ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన లేదన్న సునీల్ గవస్కర్
- ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే టోర్నీ ఉంటుందంటున్న బీసీసీఐ వర్గాలు
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'తో దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఉగ్రవాద శిబిరాలను తుదముట్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుతం కీలక దశలో ఉన్న ఐపీఎల్ 2025 సీజన్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినందున టోర్నమెంట్ యథావిధిగా కొనసాగుతుందా లేదా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి కీలక సమయంలో ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్లో 56 మ్యాచ్లు ముగిశాయి. లీగ్ దశలో మరో 14 మ్యాచ్లు, నాకౌట్, ఫైనల్తో కలిపి ఇంకో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన తరుణంలో, ఏడు జట్లు టాప్-4 స్థానాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేయాలా లేదా రద్దు చేయాలా అనేది బీసీసీఐ ముందున్న పెద్ద సవాలు. అయితే, ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ, ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి అధికారిక ఆదేశాలు అందలేదని తెలిపాయి. "బీసీసీఐ నిరంతరం పరిస్థితిని గమనిస్తూనే ఉంది. పరిస్థితులు తీవ్రంగా మారితే అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటివరకైతే షెడ్యూల్ ప్రకారమే టోర్నీ కొనసాగుతుంది" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. "ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దీనిపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. మేమింకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అప్పుడు ఐపీఎల్పై ఓ నిర్ణయానికి వస్తాం" అని ధుమాల్ వివరించారు.
సాధారణంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను వెంటనే వెనక్కి పిలిపించే అవకాశం ఉంటుంది. అయితే, భారత్లో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని విదేశీ బోర్డులకు కూడా తెలుసని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, ఇప్పటివరకు విదేశీ క్రికెటర్లు ఎవరూ తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. "నా వరకైతే అలాంటి సమాచారమేమీ రాలేదు. భారత్ చాలా సురక్షితమైన దేశమని వారికీ తెలుసు. కాబట్టి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉంది. ఇన్నాళ్లుగా మనం చాలా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దానికి కారణం భారత సైన్యమే. అందుకే ఏ విదేశీ క్రికెటర్, వ్యాఖ్యాత కూడా అభద్రతాభావంతో లేరని భావిస్తున్నా" అని గవస్కర్ వెల్లడించారు.
ఇలాంటి కీలక సమయంలో ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్లో 56 మ్యాచ్లు ముగిశాయి. లీగ్ దశలో మరో 14 మ్యాచ్లు, నాకౌట్, ఫైనల్తో కలిపి ఇంకో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన తరుణంలో, ఏడు జట్లు టాప్-4 స్థానాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేయాలా లేదా రద్దు చేయాలా అనేది బీసీసీఐ ముందున్న పెద్ద సవాలు. అయితే, ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ, ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి అధికారిక ఆదేశాలు అందలేదని తెలిపాయి. "బీసీసీఐ నిరంతరం పరిస్థితిని గమనిస్తూనే ఉంది. పరిస్థితులు తీవ్రంగా మారితే అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటివరకైతే షెడ్యూల్ ప్రకారమే టోర్నీ కొనసాగుతుంది" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. "ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దీనిపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. మేమింకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అప్పుడు ఐపీఎల్పై ఓ నిర్ణయానికి వస్తాం" అని ధుమాల్ వివరించారు.
సాధారణంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను వెంటనే వెనక్కి పిలిపించే అవకాశం ఉంటుంది. అయితే, భారత్లో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని విదేశీ బోర్డులకు కూడా తెలుసని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, ఇప్పటివరకు విదేశీ క్రికెటర్లు ఎవరూ తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. "నా వరకైతే అలాంటి సమాచారమేమీ రాలేదు. భారత్ చాలా సురక్షితమైన దేశమని వారికీ తెలుసు. కాబట్టి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉంది. ఇన్నాళ్లుగా మనం చాలా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దానికి కారణం భారత సైన్యమే. అందుకే ఏ విదేశీ క్రికెటర్, వ్యాఖ్యాత కూడా అభద్రతాభావంతో లేరని భావిస్తున్నా" అని గవస్కర్ వెల్లడించారు.