Maoists: ములుగు అడవుల్లో ల్యాండ్ మైన్ పేల్చి ముగ్గురు పోలీసులను బలిగొన్న మావోయిస్టులు

- తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల దాడి
- కూంబింగ్ ఆపరేషన్లో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మృతి
- నిఘా సమాచారంతో గాలింపు చేపడుతుండగా ఘటన
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మైన్ పేలిన ఘటనలో ముగ్గురు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. ములుగు జిల్లా వాజేడు పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రతా దళాలు తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో, పోలీసుల రాకను పసిగట్టిన మావోయిస్టులు ఒక్కసారిగా తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
అప్రమత్తంగా ఉన్న మావోయిస్టులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి భద్రతా బలగాలను తాము ముందుగా అమర్చిన ల్యాండ్మైన్ ఉన్న ప్రదేశం వైపు మళ్లించినట్లు సమాచారం. బలగాలు నిర్దిష్ట ప్రాంతానికి చేరుకున్న వెంటనే మావోయిస్టులు ల్యాండ్మైన్ను పేల్చివేశారు. ఈ పేలుడు ధాటికి ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దాడి మావోయిస్టులు పక్కా ప్రణాళికతోనే చేశారని స్పష్టమవుతోంది.
సంఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి. ఉన్నతాధికారులు కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతి చెందిన పోలీసుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ దాడి మావోయిస్టుల కదలికలు, వారి కార్యకలాపాల తీవ్రతను మరోసారి తేటతెల్లం చేసింది. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రతా దళాలు తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో, పోలీసుల రాకను పసిగట్టిన మావోయిస్టులు ఒక్కసారిగా తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
అప్రమత్తంగా ఉన్న మావోయిస్టులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి భద్రతా బలగాలను తాము ముందుగా అమర్చిన ల్యాండ్మైన్ ఉన్న ప్రదేశం వైపు మళ్లించినట్లు సమాచారం. బలగాలు నిర్దిష్ట ప్రాంతానికి చేరుకున్న వెంటనే మావోయిస్టులు ల్యాండ్మైన్ను పేల్చివేశారు. ఈ పేలుడు ధాటికి ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దాడి మావోయిస్టులు పక్కా ప్రణాళికతోనే చేశారని స్పష్టమవుతోంది.
సంఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి. ఉన్నతాధికారులు కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతి చెందిన పోలీసుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ దాడి మావోయిస్టుల కదలికలు, వారి కార్యకలాపాల తీవ్రతను మరోసారి తేటతెల్లం చేసింది. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.