Ravi Shastri: భారత్-పాక్ హై టెన్షన్... ఆసక్తికర పోస్టు చేసిన రవిశాస్త్రి

- ప్రధాని మోదీ, భారత ప్రభుత్వంపై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రశంసలు
- దేశాన్ని 150 కోట్ల మందితో కూడిన 'ఇండియా యునైటెడ్' జట్టుగా అభివర్ణన
- సాయుధ బలగాలు ముందుండి నడిపిస్తుండగా, మోదీ ప్రభుత్వం కెప్టెన్సీ వహిస్తోందని వ్యాఖ్య
- ప్రధాని నరేంద్ర మోదీని 'GOAT' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)గా కితాబు
- ఇంతటి పటిష్టమైన, ఐక్య భారతావనిని చూడటం ఇదే ప్రథమమని ఉద్ఘాటన
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, మాజీ ప్రధాన కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి తాజాగా దేశ ఐక్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో... ప్రస్తుత భారతదేశాన్ని ఒక అద్భుతమైన క్రీడా జట్టుతో పోలుస్తూ, ప్రధాని మోదీని 'GOAT' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) కెప్టెన్గా అభివర్ణించడం విశేషం.
తన క్రీడా జీవితంలో ఎన్నో యునైటెడ్ జట్లను చూశానని, కానీ 150 కోట్ల మంది ప్రజలతో కూడిన 'ఇండియా యునైటెడ్' జట్టును చూడటం ఇదే మొదటిసారని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఈ అద్భుతమైన జట్టు మన మహోన్నత సాయుధ బలగాల నేతృత్వంలో మైదానంలోకి దిగిందని అభివర్ణించారు.
దేశాన్ని నడిపిస్తున్న ఈ జట్టుకు నరేంద్ర మోదీ జీ మరియు ఆయన ప్రభుత్వం కెప్టెన్గా వ్యవహరిస్తున్నారని శాస్త్రి ప్రశంసించారు. ఇలాంటి పటిష్టమైన, సమష్టి స్ఫూర్తితో ముందుకు సాగుతున్న భారతదేశాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని రవిశాస్త్రి తన మనోభావాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, దేశ నాయకత్వానికి, ప్రజల ఐక్యతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుపుతూ, "జై హింద్" అంటూ ట్వీట్ చేశారు.
తన క్రీడా జీవితంలో ఎన్నో యునైటెడ్ జట్లను చూశానని, కానీ 150 కోట్ల మంది ప్రజలతో కూడిన 'ఇండియా యునైటెడ్' జట్టును చూడటం ఇదే మొదటిసారని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఈ అద్భుతమైన జట్టు మన మహోన్నత సాయుధ బలగాల నేతృత్వంలో మైదానంలోకి దిగిందని అభివర్ణించారు.
దేశాన్ని నడిపిస్తున్న ఈ జట్టుకు నరేంద్ర మోదీ జీ మరియు ఆయన ప్రభుత్వం కెప్టెన్గా వ్యవహరిస్తున్నారని శాస్త్రి ప్రశంసించారు. ఇలాంటి పటిష్టమైన, సమష్టి స్ఫూర్తితో ముందుకు సాగుతున్న భారతదేశాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని రవిశాస్త్రి తన మనోభావాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, దేశ నాయకత్వానికి, ప్రజల ఐక్యతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుపుతూ, "జై హింద్" అంటూ ట్వీట్ చేశారు.