Vennella Kishore: నేను హీరో అని నాకు తెలియకుండానే సినిమా తీసేశారు: వెన్నెల కిశోర్

- 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' చిత్రంలో తానే హీరో అనే విషయం తనకు తెలియదన్న వెన్నెల కిశోర్
- సినిమాలో వేరే హీరో ఉన్నాడని ముందు చెప్పారని వెల్లడి
- నేనే హీరో అని తెలిస్తే ప్రమోషన్లకు వచ్చేవాడినని వ్యాఖ్య
తాను కథానాయకుడిగా నటించినట్లు తనకే తెలియకుండా ఒక సినిమా పూర్తయిందంటూ హాస్య నటుడు వెన్నెల కిశోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' చిత్రంలో వెన్నెల కిశోర్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే, ఈ సినిమాలో తనే హీరో అనే విషయం తనకు ముందుగా తెలియదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు వెన్నెల కిశోర్ హాజరుకాకపోవడంపై చిత్ర బృందం స్పందిస్తూ... ఆ విషయం గురించి ఆయన్నే అడగాలని పేర్కొనడం గతంలో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో వెన్నెల కిశోర్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. "ఈ సినిమాలో నేను హీరో అనే సంగతి నాకు తెలియదు. నాకు ముందుగా సినిమా కథ మొత్తం చెప్పలేదు. ఈ మధ్య నేను అలా అడగడం కూడా మానేశాను, ఎందుకంటే కొందరు కథ మొత్తం అడిగితే ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అందుకే, నా పాత్ర పరిధి వరకే చెప్పమని అడిగాను, వారు చెప్పారు. ఏడు రోజుల కాల్షీట్లు ఇచ్చి, నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తిచేశాను. ఆ తర్వాత కొన్ని భావోద్వేగ సన్నివేశాలు జోడించాల్సి ఉందని చెప్పడంతో, వెళ్లి నటించి వచ్చాను" అని వెన్నెల కిశోర్ వివరించారు.
సినిమా విడుదల సమయంలో తనే హీరో అని పోస్టర్లలో చూడటం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు. "అసలు నాకే తెలియకుండా నన్ను హీరోగా ఎలా చేశారో అర్థం కాలేదు. నాకు కథ చెప్పినప్పుడు ఈ సినిమాలో వేరే హీరో ఉన్నాడని, అతనికి జోడీగా అనన్య నాగళ్ల నటిస్తోందని చెప్పారు. కానీ చివరికి నన్ను హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ విషయం నాకు తెలియకుండానే జరిగింది" అని కిశోర్ పేర్కొన్నారు. ఒకవేళ దర్శకనిర్మాతలు తానే హీరోనని ముందుగా స్పష్టం చేసి ఉంటే, తాను కూడా ప్రచార కార్యక్రమాలకు వచ్చి ఉండేవాడినేమో అని చెప్పారు.
మరోవైపు, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు వెన్నెల కిశోర్ హాజరుకాకపోవడంపై చిత్ర బృందం స్పందిస్తూ... ఆ విషయం గురించి ఆయన్నే అడగాలని పేర్కొనడం గతంలో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో వెన్నెల కిశోర్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. "ఈ సినిమాలో నేను హీరో అనే సంగతి నాకు తెలియదు. నాకు ముందుగా సినిమా కథ మొత్తం చెప్పలేదు. ఈ మధ్య నేను అలా అడగడం కూడా మానేశాను, ఎందుకంటే కొందరు కథ మొత్తం అడిగితే ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అందుకే, నా పాత్ర పరిధి వరకే చెప్పమని అడిగాను, వారు చెప్పారు. ఏడు రోజుల కాల్షీట్లు ఇచ్చి, నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తిచేశాను. ఆ తర్వాత కొన్ని భావోద్వేగ సన్నివేశాలు జోడించాల్సి ఉందని చెప్పడంతో, వెళ్లి నటించి వచ్చాను" అని వెన్నెల కిశోర్ వివరించారు.
సినిమా విడుదల సమయంలో తనే హీరో అని పోస్టర్లలో చూడటం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు. "అసలు నాకే తెలియకుండా నన్ను హీరోగా ఎలా చేశారో అర్థం కాలేదు. నాకు కథ చెప్పినప్పుడు ఈ సినిమాలో వేరే హీరో ఉన్నాడని, అతనికి జోడీగా అనన్య నాగళ్ల నటిస్తోందని చెప్పారు. కానీ చివరికి నన్ను హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ విషయం నాకు తెలియకుండానే జరిగింది" అని కిశోర్ పేర్కొన్నారు. ఒకవేళ దర్శకనిర్మాతలు తానే హీరోనని ముందుగా స్పష్టం చేసి ఉంటే, తాను కూడా ప్రచార కార్యక్రమాలకు వచ్చి ఉండేవాడినేమో అని చెప్పారు.