Gujarat Women: 1971 లో మహిళా శక్తి: 72 గంటల్లో రన్ వేను పునరుద్ధరించిన మహిళలు

- పాక్ బాంబులతో భుజ్ ఎయిర్ స్ట్రిప్ ధ్వంసం
- సైన్యానికి అండగా కదిలివచ్చిన 300 మంది మహిళలు
- రాత్రిపగలు శ్రమించి రన్ వే పునర్నిర్మాణం
పాకిస్థాన్ తో 1971 లో జరిగిన యుద్ధంలో గుజరాత్ మహిళలు చూపిన ధైర్యసాహసాలు భారత వాయుసేనకు వెన్నుదన్నుగా నిలిచాయి. శత్రువుల దాడిలో ధ్వంసమైన రన్ వేను దాదాపు 300 మంది మహిళలు అవిశ్రాంతంగా శ్రమించి 72 గంటల్లోనే పునర్నిర్మించారు. నాటి ఆ వీరమహిళల సాహసోపేత కృత్యం వివరాలు..
1971 డిసెంబర్ లో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరంపై పాకిస్థాన్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. సుమారు 14 నాపామ్ బాంబులతో దాడి చేసి, ఎయిర్స్ట్రిప్ను ధ్వంసం చేశాయి. దీంతో భారత యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది దేశ రక్షణకు తీవ్ర ఆటంకంగా మారింది.
అప్పటి భుజ్ వైమానిక స్థావరం ఇన్ఛార్జి, స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్ణిక్ ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని మాధాపూర్ గ్రామస్థుల సహాయం కోరారు. ఆయన పిలుపునకు స్పందించి, దాదాపు 300 మంది మహిళలు దేశభక్తితో ముందుకు వచ్చారు. రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 72 గంటల వ్యవధిలోనే రన్వేను పునర్నిర్మించారు. శత్రు విమానాల కంట పడకుండా ఉండేందుకు ఆకుపచ్చ రంగు చీరలు ధరించి, సైరన్ మోగినప్పుడల్లా సమీపంలోని పొదల్లో దాక్కుంటూ ప్రాణాలకు తెగించి పనిచేశారు.
రాళ్లు మోయడం, సిమెంట్ కలపడం వంటి కఠినమైన పనులను తమ చేతులతోనే పూర్తిచేశారు. వారిలో ఒకరైన కనాబాయి శివ్జీ హిరానీ ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, "పాకిస్థానీ విమానాలు వచ్చినప్పుడు దాక్కునేవాళ్లం. పర్యావరణంలో కలిసిపోయేందుకు ఆకుపచ్చ వస్త్రం ధరించాము," అని ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఈ సాహస మహిళల కృషి ఫలితంగా, భారత యుద్ధ విమానాలు తిరిగి గగనంలోకి దూసుకెళ్లి, యుద్ధ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. వారి ధైర్యసాహసాలు, దేశభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కాగా, ఈ వృత్తాంతంతో అజయ్ దేవ్ గణ్ హీరోగా ఓ సినిమా కూడా వచ్చింది.

1971 డిసెంబర్ లో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరంపై పాకిస్థాన్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. సుమారు 14 నాపామ్ బాంబులతో దాడి చేసి, ఎయిర్స్ట్రిప్ను ధ్వంసం చేశాయి. దీంతో భారత యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది దేశ రక్షణకు తీవ్ర ఆటంకంగా మారింది.
అప్పటి భుజ్ వైమానిక స్థావరం ఇన్ఛార్జి, స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్ణిక్ ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని మాధాపూర్ గ్రామస్థుల సహాయం కోరారు. ఆయన పిలుపునకు స్పందించి, దాదాపు 300 మంది మహిళలు దేశభక్తితో ముందుకు వచ్చారు. రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 72 గంటల వ్యవధిలోనే రన్వేను పునర్నిర్మించారు. శత్రు విమానాల కంట పడకుండా ఉండేందుకు ఆకుపచ్చ రంగు చీరలు ధరించి, సైరన్ మోగినప్పుడల్లా సమీపంలోని పొదల్లో దాక్కుంటూ ప్రాణాలకు తెగించి పనిచేశారు.
రాళ్లు మోయడం, సిమెంట్ కలపడం వంటి కఠినమైన పనులను తమ చేతులతోనే పూర్తిచేశారు. వారిలో ఒకరైన కనాబాయి శివ్జీ హిరానీ ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, "పాకిస్థానీ విమానాలు వచ్చినప్పుడు దాక్కునేవాళ్లం. పర్యావరణంలో కలిసిపోయేందుకు ఆకుపచ్చ వస్త్రం ధరించాము," అని ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఈ సాహస మహిళల కృషి ఫలితంగా, భారత యుద్ధ విమానాలు తిరిగి గగనంలోకి దూసుకెళ్లి, యుద్ధ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. వారి ధైర్యసాహసాలు, దేశభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కాగా, ఈ వృత్తాంతంతో అజయ్ దేవ్ గణ్ హీరోగా ఓ సినిమా కూడా వచ్చింది.

